భారీ చారిత్రాత్మక కథా చిత్ర నిర్మాణాన్ని డ్రాప్ చేసుకున్నాక దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం మూడు సబ్జెక్టులపై వర్క్ చేసున్నాడట. వీటిలో ఒకటి యాక్షన్ ప్రధానంగా సాగే కమర్షియల్ చిత్రం. ముందుగా ఈ చిత్రాన్నే డైరెక్ట్ చేయాలని మణి నిర్ణయించుకుని, ఆ ప్రకారం వర్క్ చేస్తున్నాడని కోలీవుడ్ సమాచారం. ఇందులో విజయ్ కథానాయకుడుగా నటిస్తాడని అంటున్నారు. అందుకే, హిస్టారికల్ సినిమాని డ్రాప్ చేసుకున్నాక దాని కోసం బుక్ చేసుకున్న మహేష్ బాబు, ఆర్య, అనుష్కల డేట్స్ కేన్సిల్ చేసి, విజయ్ డేట్స్ ను మాత్రం వుంచుకున్నాడు. విజయ్ కూడా కమర్షియల్ హీరో కావడంతో ప్రస్తుతం అనుకుంటున్న సబ్జెక్ట్ కి అతను సరిగ్గా సూట్ అవుతాడని మణి భావిస్తున్నాడట.
No comments:
Post a Comment