అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఇందుకు పూరీ జగన్నాథ్ కూడా సిద్ధంగా ఉన్నాడనీ ... అభిషేక్ బచ్చన్ ని హీరోగా ఎంచుకున్నామని అన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఈ రోజు ఉదయం ఆయన ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు. దాంతో మళ్లీ ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయిందని తెలుస్తోంది.
Wednesday, March 14, 2012
బాలీవుడ్ కి వెళ్తోన్న 'బిజినెస్ మేన్'
గోపీచంద్ కి సాయం చేయబోతోన్నతాప్సీ
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై రూపొందుతోన్న చిత్రంలో గోపీచంద్ నటిస్తోన్న సంగతి ప్రేక్షకులకి తెలుసు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెర కెక్కుతోన్న ఈ సినిమాకి కొంత మంది కథానాయికలను పరిశీలించి చివరికి తాప్సీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి కోసం అన్వేషిస్తోన్న గోపీచంద్ కి కథానాయికగా తాప్సీ సాయం చేస్తూవుంటుంది. ఇక గతంలో గోపీచంద్ నటించిన 'ఒక్కడున్నాడు' చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా వ్యవహరించారు. దాదాపు అయిదేళ్ల గ్యాప్ తరువాత వస్తోన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోననే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి.
ఐశ్వర్యరాయ్ కూతురు పేరు ఖరారు
తమిళ విలన్ గా జగపతిబాబు ?
'దమ్ము'చూపించే పాట ఖర్చు 3 కోట్లు
తెలుగు తెరపై అమితాబ్ 'కాందహార్'
Subscribe to:
Comments (Atom)