
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై రూపొందుతోన్న చిత్రంలో గోపీచంద్ నటిస్తోన్న సంగతి ప్రేక్షకులకి తెలుసు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెర కెక్కుతోన్న ఈ సినిమాకి కొంత మంది కథానాయికలను పరిశీలించి చివరికి తాప్సీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి కోసం అన్వేషిస్తోన్న గోపీచంద్ కి కథానాయికగా తాప్సీ సాయం చేస్తూవుంటుంది. ఇక గతంలో గోపీచంద్ నటించిన 'ఒక్కడున్నాడు' చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా వ్యవహరించారు. దాదాపు అయిదేళ్ల గ్యాప్ తరువాత వస్తోన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోననే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి.
No comments:
Post a Comment