అసమాన నటుడు అమితాబ్ నటించిన మలయాళ చిత్రం 'కాందహార్' త్వరలో తెలుగు తెర పై ప్రత్యక్షం కాబోతోంది. 'కాందహార్' విమానం హైజాక్ చేయబడిన నేపథ్యాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్నితెరకెక్కించారు. మేజర్ రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాని, రామ్ ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్ వారు తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర ధారులైన తండ్రీ కొడుకులుగా అమితా బచ్చన్ ... గణేష్ వెంకట్రామన్ నటించారు. మిలటరీ మేజర్ గా మోహన్ లాల్ ... ఇతర ముఖ్య పాత్రల్లో ... సుమలత - అనన్య - కావేరిఝా తదితరులు నటించారు. ఈ సినిమా టేకింగ్ అద్భుతంగా ఉంటుందనీ ... ఆద్యంతం ఉత్కంఠ భరితంగా కొనసాగుతుందని నిర్మాతలు శేషగిరి - విశ్వనాథ్ అన్నారు. మలయాళ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న ఈ సినిమా, తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని చెప్పారు. ఈ సినిమా ఏప్రిల్లో అనువాద కార్య క్రమాల్ని పూర్తి చేసుకుని, మే లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు.
No comments:
Post a Comment