రామ్ - తమన్నా జంటగా కనువిందు చేయనున్న'ఎందుకంటే ప్రేమంట' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలోవుంది. కరుణాకరణ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుని, పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. కర్నాటకలోని బీదర్ లో ప్రస్తుతం నాయికా నాయకుల మధ్య ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకను రేపు హైదరాబాద్ లో ప్లాన్ చేయడంతో రామ్ - తమన్నా తదితరులు హైదరాబాద్ రానున్నారు. ఈ సినిమాని అందమైన దృశ్య కావ్యంగా మలచడానికి భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. తెరపై రామ్ - తమన్నాల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని భావించిన కుర్రకారు ప్రేక్షకులు, ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 'కందిరీగ' సినిమాతో విజయాన్ని అందుకున్నరామ్, 'రచ్చ' సినిమాతో సక్సెస్ చూసిన తమన్నా ఈ సినిమాతో కలిసి హిట్ కొడతారో లేదో చూడాలి.
No comments:
Post a Comment