Wednesday, February 1, 2012
'శ్రద్ద' పెట్టి మరీ చేస్తున్న సినిమా!
కమల్ సరసన కనువిందు చేయనున్నకత్రినా
ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న 'తలైవన్ ఇరుకిరన్' అనే భారీ బడ్జెట్ సినిమాలో ఆమె కమల్ సరసన కనువిందు చేయనుంది. ఇక 'కొచ్చాడియాన్' సినిమాలో రజనీ కాంత్ సరసన కథానాయికగా కత్రినాకైఫ్ బాగుంటుందని భావించిన కె.ఎస్.రవికుమార్, ఆ విషయమై ఆమెని కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ...అమీర్ ల సినిమాలతో చాలా బిజీగా వున్న కత్రినా... 'ఏక్ థా టైగర్ ' అనే సినిమాలో పోరాట సన్నివేశాల్లో పాల్గొనేందుకు ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందని తెలుస్తోంది.
టెన్షన్ పెంచుతున్న సమంతా
ఇక సమంతా ఇవేవీ పట్టించు కోకుండా 'ఈగ' సినిమా విజయం కోసం తాను ఎదురు చూస్తున్నట్టు చెపుతోంది. ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ పై ఎవరూ చేయని అద్భుతాన్ని రాజమౌళి ఆవిష్కరించనున్నారనీ... ఈ సినిమా ఆయన స్టామిన ఏంటనేది మరోసారి నిరూపిస్తుందని అంటోంది. తనకి నాలుగో విజయాన్ని అందించనున్న ఈ సినిమా కోసం నాలుగు కళ్లతో ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఈ సినిమాతో ఆమె ఎక్కడికో వెళ్లి పోతుందనే సంగతి పక్కన పెడితే... ఈ మాటలు మాత్రం మిగతా కథానాయికలకి టెన్షన్ పెంచేస్తున్నాయట!
తాప్సీకి అలాంటి ఫీలింగ్ రాదట!
తన గత చిత్రాలు చూసినపుడు సరిగ్గాచేయలేదనే ఫీలింగ్ తనకి అస్సలు రాదని చెప్పింది. అలానే పాత్రల ఎంపిక విషయంలో కూడా తనకా ఫీలింగ్ కలగదని అంది. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడటం తనకి అలవాటు లేదనీ... ప్రస్తుతం చేసే వాటిపై శ్రద్ధ పెట్టడమే తనకి ఇష్టమని తేల్చి చెప్పింది. తన నిర్ణయాలు కూడా పర్ ఫెక్ట్ గా వుంటాయి కాబట్టి, గతం గురించి చింతించవలసిన అవసరం తనకి రాలేదని అంది. ఈ మాటలు విన్న వాళ్లు మాత్రం ఆమె ముద్దు ముద్దు మాటల్లో ఇంతటి పరిపక్వత ఉందనుకోలేదు అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇస్తున్నారట! ఇక ప్రస్తుతం తాప్సీ 'దరువు'... 'గుండెల్లో గోదారి' చిత్రాలు చేస్తోంది.
తెలుగు తెరపై మరో హాలీవుడ్ హారర్
మలేసియాలో 'నా ఇష్టం' పాట
హీరో ఇంట్రడక్షన్ కి సంబంధించిన ఆ సాంగుని ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో మలేసియాలో చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి చెప్పారు. ఈ సినిమాకి చక్రి చాలా వినసొంపైన బాణీలు అందించారనీ... ప్రముఖ గాయనీ గాయకులు వాటిని ఆలపించారని అన్నారు. ఈ నెలలో ఆడియో వేడుకని వినూత్నంగా జరపబోతున్నామనీ... మార్చ్ ద్వితీయార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. 'లీడర్'... 'నేను నా రాక్షసి' వంటి పరాజయాలతో డీలా పడిన రానాకి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుందో...ఏమో..!
'ధోని' హక్కులు పొందిన దిల్ రాజు
నటుడిగా అన్నిరకాల ప్రయోగాలు చేస్తూనే నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టిన ప్రకాష్ రాజ్, తన అభిరుచికి తగిన సినిమాలను అందించారు. ఇక ఇప్పుడు దర్శకుడిగా 'ధోని' అనే సందేశాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నేటి విద్యా వ్యవస్థ పని తీరు ... తల్లిదండ్రుల ఆలోచనలకీ- పిల్లల భావాలకి మధ్య అగాధం ఏర్పడటానికి గల కారణాలకి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు -తమిళ భాషల్లో ప్రేక్షకుల్ని పలకరించనున్న ఈ సినిమా... ఈ నెల 3 న ఆడియో వేడుకని జరుపుకుని,10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు పంపిణీ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఈ రోజు ఉదయం హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన తెలియజేశారు.
Subscribe to:
Posts (Atom)