e-cigarette review Ping Yahoo GOSSIPS

Friday, February 11, 2011

జెనీలియా పెళ్లికూతురు కానుందా?

చిలిపి కళ్ల సుందరాంగి జెనీలియా త్వరలో ఇక సినిమాలకి గుడ్ బై చెప్పనుందా? ఇక రియల్ లైఫ్ లో సెటిల్ కానుందా? ఇప్పుడు బాలీవుడ్ లో ఈ వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. తన చిరకాల మిత్రుడు, సహ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను త్వరలో జెన్నీ పెళ్లి చేసుకోనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడైన రితేష్ తో జెనీలియా ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లూ తమ సాన్నిహిత్యాన్ని గుంభనంగా ఉంచిన ఈ జంట, ఈ మధ్య తమ బంధాన్ని మెల్లిగా బయటపెడుతోంది.
          ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాల వెడ్డింగ్ ఎనివేర్సరీలో ఈ జంట అందరి ముందూ కలసి మెలసి తిరిగారు. ఇది చూసిన బాలీవుడ్ జనం 'ఇక త్వరలో వీళ్లిద్దరూ మేరేజ్ చేసుకోవచ్చు. అందుకే తమ బంధాన్ని నలుగురి ముందూ ప్రదర్శిస్తున్నారు' అంటున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్నాళ్ళాగాల్సిందే! 

శాటిలైట్ రైట్స్ లో 'దూకుడు'


ఒకప్పుడు తెలుగు సినిమాలకు శాటిలైట్ రైట్స్ రూపంలో మంచి డబ్బులు వచ్చేవి. చిన్నా చితకా సినిమాలకి కూడా లక్షల్లో వచ్చేవి. జీటీవీ తమ తెలుగు చానెల్ స్టార్ట్ చేసాక ఇది మరీ ఎక్కువైపోయింది. ఫ్లాప్ సినిమాలకు కూడా కోట్లు ఆఫర్ చేయడం జరిగింది. దాంతో ఆ పోటీని తట్టుకోలేక, ఈటీవీ, మాటీవీ, జెమినీ కొన్నాళ్ల క్రితం తమకు తాముగా ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ఒక్క జీటీవీ మాత్రమే వీటిని ఎక్కువగా కొంటోంది. జెమినీ కూడా అప్పుడప్పుడు కొంటోంది కానీ, పోటీకి వెళ్లి కొనడం లేదు. దాంతో పెద్ద హీరోల సినిమాలకే మంచి రేటు వస్తోంది.
       ఈ నేపధ్యంలో మాటీవీ కొత్తగా 'మా మూవీస్' పేరుతో మరో కొత్త చానెల్ ని ప్రారంభించడంతో శాటిలైట్ రైట్స్ మళ్లీ ఊపందుకుంటున్నాయని  టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దానికి ఊతమిస్తున్నట్టుగా ఇటీవల మాటీవీ 'దూకుడు' సినిమా శాటిలైట్ రైట్స్ ని పెద్ద మొత్తం వెచ్చించి, చేజిక్కించుకున్నట్టు చెబుతున్నారు. సుమారు 5 .75 కోట్లకు ఈ సినిమా హక్కుల్ని మాటీవీ పొందినట్టు తెలుస్తోంది. దీంతో మాటీవీ ఇక శాటిలైట్ రైట్స్ విషయంలో 'దూకుడు'గా వెళ్లడం ఖాయమని అంటున్నారు. 

డ్రగ్స్ తో పట్టుబడ్డ జీవిత సోదరుడు మురళి

టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో తాజాగా ఈ రోజు మరో పెద్ద చేప దొరికిపోయింది. నిర్మాత, ప్రముఖ నటి జీవిత సోదరుడు అయిన మురళి 200 గ్రాముల కొకైన్ తో రెడ్ హేన్ డేడ్ గా పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో 'మగాడు', 'శేషు' వంటి చిత్రాలను నిర్మించిన మురళి గత కొంతకాలంగా డ్రగ్స్ కి అలవాటు పడ్డాడని అంటున్నారు. ఆ క్రమంలో కొకైన్ తీసుకుని వెళుతుండగా హైదరాబాదు, జూబిలీ హిల్స్ ప్రాంతంలో మాటువేసిన వెస్ట్ జోన్ డీసీపీ బృందం మురళీని అరెస్ట్ చేసింది. ఆ సమయంలో అతనితో బాటు వున్న మరో ఇద్దరు వ్యక్తుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. మొన్నామధ్య టాలీవుడ్ ని డ్రగ్స్ ఉదంతం కుదిపేసిన సంగతి తెలిసిందే. బడా తారలు కూడా ఈ డ్రగ్స్ వలయంలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.

Wednesday, January 12, 2011

"గలగలా మాట్లాడడమే నాకు తెలుసు" -జెనీలియా

ఇప్పటికీ జెనీలియాని అంతా 'బొమ్మరిల్లు' హాసిని అనే పిలుస్తారు. ఆ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకున్న జెన్నీ మనసులో మాటలని ఆమె మాటల్లోనే చదవండి...
       హాయ్... ఏమిటీ.. జెనీలియా ప్రతి సినిమాలోనూ అల్లరి పిల్లలా కనపడుతుందీ, అనుకుంటున్నారు కదూ.. మీరే కాదులెండి... చాలా మంది నన్ను ఇదే విషయం అడుగుతూ వుంటారు. నిజమే...నేను మామూలుగా కూడా అల్లరిపిల్లనే! ఇంకా చెప్పాలంటే నేను టాం బాయ్ ని! ఎవరో ఏదో అనుకుంటారని నా ఎంజాయ్ మెంట్ ని పాడుచేసుకోలేను. చిన్నప్పుడైతే ఇక చెప్పేక్కర్లేదు. అల్లరంతా మనదే! ఫ్రెండ్స్ తో కలిసి అన్ని విషయాల్లోనూ చాలా హడావిడి చేసేదాన్ని. అల్లరికి తోడు మనం స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్. పర్టిక్యులర్ గా ఒక ఆట అంటూ లేదు. ఏ ఆటలోనైనా సరే నేనే ముందుండే దాన్ని. బేస్కేట్ బాల్, క్రికెట్, హాకీ... అన్ని ఆటలూ ఆడాను. మీకో విషయం తెలియదు. నేను స్పోర్ట్స్ లో స్టేట్ లెవెల్ దాకా వెళ్లాను.కాలేజ్ రోజుల్లో ముంబై  ఆర్ధర్ రోడ్ లోని కాఫీ బార్లలోనే ఎక్కువగా గడిపేదాన్ని. ఫ్రెండ్స్ తో కలిసి అక్కడ కాఫీ తాగుతుంటే అసలు సమయమే తెలిసేది కాదు. ఇప్పటికీ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. సాదా సీదా అమ్మాయిలా ఆ బార్లో కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ కాఫీ సిప్ చేయాలనిపిస్తుంది. అప్పుడప్పుడు వెళుతుంటా కూడా. అయితే, బిజీ వల్ల ఈమధ్య అసలు కుదరడం లేదు. అయ్ మిస్ ఎ లాట్! 

      మీకో విషయం తెలసా? అసలు నేను సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు.  మోడలింగులో కూడా పెద్దగా అనుభవం లేదు. అలాంటిది అనుకోకుండా రామోజీరావు గారు నిర్మించిన 'తుజే మేరీ కసం' సినిమాకి సెలెక్ట్ అయ్యాను. అయితే, మా పేరెంట్స్ వెంటనే ఒప్పుకోలేదు. ఎందుకంటే, సినిమా వాతావరణం గురించి అప్పటికే వాళ్లకి వేరే అభిప్రాయం వుంది. దాంతో కాస్త టైం పట్టింది వాళ్లు ఓకే చెప్పడానికి. నేను కూడా ముందు భయపడ్డాను. తర్వాత అలా అలా అంతా అలవాటైపోయింది. తర్వాత కెరీర్ లో ఎన్నో అప్ అండ్ దౌన్స్ చూసాను. మెల్లిగా పీక్ పాయింట్ కి చేరాను. అయితే, ఎప్పుడూ నేను భయపడలేదు. ఏ పరిస్థితిలోనూ కూడా పారిపోదామనిపించలేదు. ఇక్కడే వుండి సాధించాలనుకున్నాను. ఎన్నో మాటలు పడ్డాను. నేనుంటే సినిమాలు ఫ్లాప్ అన్నారు. అన్నిటినీ మౌనంగా భరించాను. ఒక్కసారి హిట్ వచ్చాక మళ్లీ అంతా నన్ను పొగడడం మొదలెట్టారు. నేను అటు అపజయాలనీ, ఇటు జయాలనీ రెండింటినీ సమానంగానే స్వీకరించాను. దేనికీ కుంగిపోలేదు, దేనికీ మిడిసిపడలేదు. అంతా మన అదృష్టాన్ని బట్టే వుంటుంది. అంతే!     
      ఇప్పుడు బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. ఇక్కడ కూడా నాకు మంచి పేరే వచ్చింది. సౌత్ లో చేస్తూనే హిందీలో కూడా చేస్తాను. దేనినీ వదులుకోను. సౌత్ లో లానే బాలీవుడ్ లో కూడా నాకు మంచి గౌరవం ఇస్తున్నారు. ఇక సెట్ లో నేను ఎక్కడున్నా ఒకటే. సరదాగా వుంటాను. నా చుట్టూ వున్న వాళ్లు కూడా అలాగే వుండాలని కోరుకుంటాను. గలగలా మాట్లాడడమే నాకు తెలుసు. మూతి బిడాయించుకుని రిజర్వేడ్ గా వుండడం ఈ జెన్నీకి తెలియదు. తానెప్పుడూ ఇలాగే జోష్ తో వుంటుంది!

చిరంజీవి కోసం వర్మ పాట్లు


 
 
 
 
       రాంగోపాల్ వర్మ పట్టువదలని విక్రమార్కుడిగా చిరంజీవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తనతో చిరంజీవి ఇక సినిమా చేయడని తెలిసి కూడా రకరకాల పద్ధతుల్లో తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ట్విట్టెర్ ని కూడా ఉపయోగించుకుంటున్నాడు. అస్తమానూ చిరంజీవి ప్రస్తావన ఏదో ఒక రూపంలో తెస్తున్నాడు. తాజాగా కూడా తెచ్చాడు. "చిరంజీవి గారి 150 వ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇది ఇంకా ఎందుకు స్టార్ట్ అవలేదో ఎవరైనా చెప్పగలరా?" అంటూ అడుగుతున్నాడు. "చిరంజీవి గారు నాతో చేయరని తెలుసు. దానికి మా ఇద్దరి మధ్య చాలా కారణాలున్నాయి. అయితే, నేను చేయాలనుకుంటున్న 'దొర' ద లార్డ్ సినిమాని ఆయనతోనే చేయాలని మాత్రం కోరుకుంటున్నాను" అంటూ సోప్ వేస్తున్నాడు. మరి, చిరంజీవి పొరబాటున వర్మ బుట్టలో పడతాడేమో చూడాలి!

'నేను-నా రాక్షసి' వాయిదా ఎందుకు?

రానా, ఇలియానా జంటగా పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న 'నేను-నా రాక్షసి' చిత్రం ఇప్పట్లో విడుదలయ్యేలా కనపడటం లేదు. మొదట్లో సంక్రాంతి రిలీజ్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి రేస్ నుంచి సైలెంట్ గా తప్పుకుంది. సమ్మె వల్ల మిగిలి వున్న షూటింగ్ ఆగిపోయిందనీ, ఇక జనవరి నెలాఖరుకే విడుదల అనీ నిన్నటి దాకా వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ డేట్ కూడా మారిందనీ, రిలీజ్ మార్చికి వాయిదా పడిందనీ వార్తలొస్తున్నాయి. దీనికి కారణం నిర్మాణానికి సంబంధించినదేనా? లేక అమితాబ్ సినిమా మోజులోపడిపోయిన పూరీ దీనిని వెనక్కి నెట్టేస్తున్నాడా? అన్నది తెలియాల్సి వుంది. 

బాలీవుడ్ లో జాగా వెతుక్కున్న 'పులి' హీరోయిన్

 
 
       ఒక్కో సినిమా కొంత మందిని పైకి లేపితే, ఒక్కో సినిమా కొందరిని అడ్రస్ లేకుండా చేసేస్తుంది. పాపం.. కధానాయిక నికీషా పటేల్ వ్యవహారం కూడా అలాగే అయిపోయింది. పవన్ కల్యాణ్ నటించిన 'పులి' సినిమా ద్వారా ఈ అమ్మాయి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ ఆ సినిమా ఫ్లాప్ తో ఆవిరైపోయాయి. 'పులి' విడుదలకు ముందు 'మా సినిమాలో నువ్వే హీరోయిన్ వి' అంటూ ప్రామిస్ చేసిన వాళ్లంతా, సినిమా కాస్తా ఫ్లాప్ అవడంతో మెల్లిగా జారుకున్నారు. దాంతో తన ఫొటో ఆల్బమ్ పట్టుకుని అటు, ఇటు తిరగడం మొదలుపెట్టింది. తాజాగా తెలిసిన సమాచారమేమిటంటే, బాలీవుడ్ లో ప్రముఖ ఫిలిం మేకర్ అయిన సుభాష్ ఘై ఈమెకు తన తదుపరి చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడట. దీంతో 'హమయ్య' అంటూ నికీషా ఊపిరి పీల్చుకుంటోంది. తన కెరీర్ తో ఆడుకున్న టాలీవుడ్ వైపు 'ఇక చచ్చినా చూడను' అని ఒట్టు కూడా పెట్టుకుందంటున్నారు.
Related Posts Plugin for WordPress, Blogger...