e-cigarette review Ping Yahoo GOSSIPS

Tuesday, July 5, 2011

SADA PHOTO GALLERY


సల్మాన్ పడక గదికి వెళ్లాలనివుంది: సమీరా రెడ్డి

టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర సీమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టుకున్న ముద్దుగుమ్మ సమీరా రెడ్డి. ఆమె సల్మాన్ ఖాన్‌పై మనస్సు పారేసుకుంది. ఖాన్ పట్ల పిచ్చి ప్రేమను చూపుతోంది. ఏకంగా సల్మాన్ ఖాన్ పడక గదిలో గడపాలని బహిరంగానే తన మనస్సులోని మాటను వెల్లడించింది.

ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను స్లీప్ వాక్ చేస్తూ సల్మాన్‌ఖాన్ బెడ్ రూంలోకి వెళ్ళాలని ఉందని చెప్పుకొచ్చింది. సల్మాన్ అంటే తనకు ఎనలేని ప్రేమ ఉందన్నారు. అయితే, సమీరా ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో పరమార్థం లేకపోలేదు.

బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌ది గోల్డెన్ హ్యాండ్‌గా ఉంది. సల్మాన్‌కు వయస్సు మీదపడుతున్నా... అతనితో జత కట్టేందుకు, బెడ్ రూమ్‌లోకి దూరాలనే ఆలోచనతో ఉండే హీరోయిన్ల జాబితా పెరిగిపోతోంది.

అందుకు ఉదాహరణగా అసిన్‌ను చెప్పుకోవచ్చు. చిత్ర పరిశ్రమకు దూరమవుతుందని అనుకుంటున్న తరుణంలో సల్మాన్‌తో జతకట్టి మళ్లీ గాడిన పడింది. అలాగే, "దబాంగ్" హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఇలా సల్మాన్ నమ్ముకుని ఎదగటాన్ని పట్టుగొమ్మగా ఉపయోగించుకుంటోంది.

Saturday, May 21, 2011

పొగడ్తలతో ఇబ్బందుల్లో పడ్డ తార


బాలీవుడ్ కథానాయిక కరీనాకపూర్ కి లౌక్యం తెలియదా? తెలియదనే అంటున్నారిప్పుడు. లేకపోతే అలా ఒకర్ని పొగిడితే మరొకరికి కోపం వస్తుందన్న విషయం తెలియకపోతే ఎలా? అని కూడా అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆమధ్య మలయాళంలో వచ్చిన 'బాడీగార్డ్' సినిమాని ప్రస్తుతం హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా చేసే ముందు అందులో హీరోయిన్ గా నటిస్తున్న కరీనాని నయనతార నటించిన మలయాళం వెర్షన్ తో బాటు, అసిన్ నటించిన తమిళ వెర్షన్ కూడా చూడమని దర్శకుడు సిద్ధిక్ సూచించాడట.
               చూశాక తన అభిప్రాయం అడిగితే, అసిన్ కన్నా నయనతార బాగా నటించిందని కరీనా కామెంట్ చేసింది. ఇప్పుడిదే పెద్ద కాంట్రావార్సీ అయి కూర్చుంది. కరీనా కామెంట్స్ విన్న అసిన్ ఇప్పుడు కరీనాపై మండిపడుతోంది. "నా నటనకి ఒకరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నేనేమిటో బాలీవుడ్ లో అందరికీ తెలుసు. ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుంది" అంటూ కరీనాకి చురకంటించింది. దీంతో, అనవసరంగా నయనతారని పొగిడి ఇబ్బందుల్లోపడ్డానే..  అని కరీనా ఇప్పుడు ఫీలవుతోందట!
 


మలేసియా వెళ్ళొచ్చిన మెగాస్టార్ మేనల్లుడు

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి 'రేయ్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి షెడ్యులు షూటింగ్ మార్చ్ 26 నుంచి ఏప్రిల్ 26 వరకు మలేసియాలో జరిగింది. ముఖ్యమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ ను కూడా అక్కడ షూట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ కొనసాగిస్తున్నారు. వచ్చే నెల 10 నుంచి అమెరికాలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
                   కథ ప్రకారం ఫస్టాఫ్ వెస్ట్ ఇండీస్ లోనూ, సెకండాఫ్ అమెరికాలోనూ జరుగుతుంది. అందుకే ఆయా ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందుతోందని దర్శకుడు చౌదరి చెబుతున్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు. శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు చౌదరి చెప్పారు. తమ 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఆ పట్టింపులు' లేవంటున్న ముద్దుగుమ్మ

అవసరమైతే బికినీ ధరించడానికి రెడీ... అనే స్టేట్ మెంట్ ఇస్తున్న కథానాయికలలో తాజాగా పూర్ణ కూడా చేరింది. ఇటీవల విడుదలైన 'సీమటపాకాయ్' సినిమా ద్వారా పూర్ణ కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విజయపథంలో పయనిస్తున్న నేపథ్యంలో, గ్లామర్ విషయంలో తనకు పట్టింపులు లేవని చెపుతోంది. "గ్లామర్ లేనిదే సినిమా లేదు. అలాంటప్పుడు మడికట్టుకుని కూర్చుంటామంటే ఎలా?" అంటోంది. అన్నట్టు, కేరళ కుట్టి అశిన్ పోలికలు ఈ పూర్ణలో బాగా వుంటాయి. అందుకే అంతా ఇప్పుడీమెను అశిన్ తో పోలుస్తున్నారు కూడా. దీనికి తను తెగ సంబరపడిపోతోంది.
                  "అశిన్ లాంటి మంచి నటి, అందగత్తెతో నన్ను పోల్చడం చాలా హ్యాపీగా వుంది. అయితే, నన్ను నన్నుగానే చూడండి. సీమటపాకాయ్ తర్వాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే వాటి వివరాలు చెబుతాను" అంటోంది పూర్ణ. ఒక సినిమా చేసిందో లేదో...  అప్పుడే తను తెలుగులో కూడా మాట్లాడేస్తోంది. మరో రెండు మూడు సినిమాలు చేస్తే తన డబ్బింగ్ తానే చెప్పుకుంటానని కూడా చెబుతోంది.

విజయ్ హీరోగా మణిరత్నం కమర్షియల్ సినిమా

భారీ చారిత్రాత్మక కథా చిత్ర నిర్మాణాన్ని డ్రాప్ చేసుకున్నాక దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం మూడు సబ్జెక్టులపై వర్క్ చేసున్నాడట. వీటిలో ఒకటి యాక్షన్ ప్రధానంగా సాగే కమర్షియల్ చిత్రం. ముందుగా ఈ చిత్రాన్నే డైరెక్ట్ చేయాలని మణి నిర్ణయించుకుని, ఆ ప్రకారం వర్క్ చేస్తున్నాడని కోలీవుడ్ సమాచారం. ఇందులో విజయ్ కథానాయకుడుగా నటిస్తాడని అంటున్నారు. అందుకే, హిస్టారికల్ సినిమాని డ్రాప్ చేసుకున్నాక దాని కోసం బుక్ చేసుకున్న మహేష్ బాబు, ఆర్య, అనుష్కల డేట్స్ కేన్సిల్ చేసి, విజయ్ డేట్స్ ను మాత్రం వుంచుకున్నాడు. విజయ్ కూడా కమర్షియల్ హీరో కావడంతో ప్రస్తుతం అనుకుంటున్న సబ్జెక్ట్ కి అతను సరిగ్గా సూట్ అవుతాడని మణి భావిస్తున్నాడట. 

నటనకు గుడ్ బై చెప్పనున్న మల్లూ బేబీ

ఏ భాషలోనూ కూడా సినిమాలు లేకపోవడం ఓపక్క, వయసు ముదిరిపోతూ వుండడం మరోపక్క ఇప్పుడు కేరళ కుట్టి మీరా జాస్మిన్ ని బాధిస్తోంది. దాంతో ఇక నటనకు స్వస్తి చెప్పాలని భావిస్తోందట. తమిళ డబ్బింగ్ సినిమా 'రన్' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఆ తర్వాత పవన్ కల్యాణ్, రవితేజ, బాలకృష్ణ, జగపతిబాబు వంటి పెద్ద తారలతో సినిమాలు చేసినప్పటికీ, మీరాకు తెలుగులో సుడి తిరగలేదు. ఇతర భాషల్లో కూడా పరిస్థితి అలాగే ఉండడంతో ఇక నటనకు గుడ్ బై చెప్పేసి, పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తను ప్రముఖ మాండిలిన్ విద్వాంసుడు మాండిలిన్ శ్రీనివాస్ సోదరుడు రాజేష్ ప్రేమలో పడింది.  త్వరలో అతనిని వివాహం చేసుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Related Posts Plugin for WordPress, Blogger...