e-cigarette review Ping Yahoo GOSSIPS

Wednesday, February 8, 2012

సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ఓకే చేసిన బన్నీ

'ఊసరవెల్లి' ఫ్లాప్ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి మరో చిత్రానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తాడని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి వినిపించిన కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం పూర్తి కాగానే, సురేందర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభిస్తారని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి తమ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. బన్నీ స్క్రిప్ట్ కి ఓకే చెప్పడంతో, దానికి మరిన్ని మెరుగులు దిద్దే కార్యక్రమంలో దర్శకుడు వున్నాడిప్పుడు. ఇందులో నటించే కథానాయిక, తదితర వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

శృంగార సన్నివేశాన్ని కళాత్మకంగా తీస్తాడట!

ఇంతకు ముందు ఎలా ఉన్నప్పటికీ, ఇప్పుడు మాత్రం బాలీవుడ్ సౌందర్యం కరీనా కపూర్ చాలా జాగ్రత్తగా ఉంటోంది. ఎందులో అనుకుంటున్నారు... శృంగార సన్నివేశాలలో నటించడంలో! అవును... సైఫ్ ఆలీఖాన్ తో పెళ్లికి కమిట్ అయిన దగ్గర నుంచీ ఆమె అలాంటి సీన్స్ చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. మాధుర్ బండార్కర్ ప్రస్తుతం రూపొందిస్తున్న 'హీరోయిన్' సినిమాలో కరీనా, అర్జున్ రామ్ పాల్ జంటగా నటిస్తున్నారు. ఇందులో అతనితో ఆమె 'బెడ్' పంచుకోవాల్సిన సందర్భం ఒకటుంది. ఆ సన్నివేశం గురించి ఇటీవల దర్శకుడు చెప్పగానే ససేమిరా చేయనని కరీనా తెగేసి చెప్పిందట. ఎంతగా నచ్చ చెప్పినా 'నో' చెప్పింది. అయితే, తాజాగా మళ్లీ ఆలోచించి, ఆ సన్నివేశానికి 'యస్' చెప్పిందట.
      మార్చ్ 20 న ముంబయ్ శివారులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు యూనిట్ వాళ్లు చెబుతున్నారు. కరీనా ఆ సీన్లో అర్జున్ తో కలిసి సిగరెట్ కాలుస్తూ... మందు కొడుతూ... చివర్లో 'బెడ్' షేర్ చేసుకుంటుంది. ఈ సన్నివేశాన్ని వల్గారిటీ లేకుండా... చాలా కళాత్మకంగా చిత్రీకరిస్తాననీ, ఆ సీన్ షూట్ చేసేటప్పుడు రూంలో తనతో బాటు కేవలం ముగ్గురు అసిస్టెంట్స్ మాత్రమే ఉంటారని కరీనాను దర్శకుడు మాధుర్ కన్విన్స్ చేశాడట. పైగా, ఆ సన్నివేశం వివరాలు ఎక్కడా వెల్లడించమని రాతపూర్వకంగా తన అసిస్టెంట్స్ ముగ్గురి నుంచీ 'కాన్ఫిడెన్షియాలిటీ కాంట్రాక్ట్' కూడా తీసుకుంటాడట.
      ఈ విషయాన్ని మాధుర్ చెప్పకపోయినా తన యూనిట్ వాళ్ల ద్వారా మీడియాకు లీక్ చేశాడు. అంటే, సినిమాకు హైప్ తెచ్చుకోవడానికి ఇదో రకం పబ్లిసిటీయేమో!  

ఇద్దరు హీరోలతో మధుర శ్రీధర్ చిత్రం


యువ నటులు వరుణ్ సందేశ్, సాయిరామ్ శంకర్ కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి మధుర శ్రీధర్ దర్శకత్వం వహిస్తారు. గతంలో ఆయన 'స్నేహగీతం', 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి అభిరుచి గల చిత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈ ప్రేమకథా చిత్రంలో 'షాపింగ్ మాల్', 'జర్నీ' చిత్రాల కథానాయిక అంజలి హీరోయిన్ గా నటిస్తుందట. 'ఇట్స్ మై లవ్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించిన మున్నా వెంకటకృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలో దీని షూటింగు ప్రారంభమవుతుంది. 

'రచ్చ' షూటింగుకి అంతరాయం

రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' సినిమా తెరకెక్కుతున్న విషయం ప్రేక్షకులకి విదితమే. మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం తమిళనాడు- కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది. కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని ఓ సరస్సులో రామ్ చరణ్ -తమన్నాలపై ఓ డ్యూయెట్ ని చిత్రీకరించేందుకు దర్శకుడు సంపత్ నంది ఏర్పాట్లు చేసుకున్నాడు. అంతా రెడీ చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటుండగా, రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటి డైరెక్టర్ సంజయ్ కుమార్ అక్కడికి వచ్చి షూటింగ్ ని అడ్డుకున్నాడట. లైఫ్ జాకెట్ లేకుండా లేక్ లోకి అనుమతించనంటూ గట్టిగా చెప్పడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ విషయంలో జరిగిన గడబిడ కారణంగా అందరికీ మూడ్ పోయిందట. అది గ్రహించిన సంపత్ నంది వెంటనే పేకప్ చెప్పాడని తెలుస్తోంది.

ఈ 23 నుంచి 'ఎవడు' షూటింగ్

రామ్ చరణ్ కథానాయకుడుగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'బృందావనం' ఫేం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. సమంతా ప్రధాన కథానాయికగా, ఎమీ జాక్సన్ రెండో కథానాయికగా రూపొందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు ఈ నెల 23 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వంశీ చెప్పాడు. ప్రస్తుతం చరణ్ చేస్తున్న 'రచ్చ' సినిమా షూటింగు త్వరలో పూర్తి కానుంది. ఆ వెంటనే 'ఎవడు' సినిమా షూటింగులో చరణ్ పాల్గొంటాడన్న మాట. ఈ చిత్రాన్ని వచ్చే సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చరణ్ కొత్త లుక్ తో కనిపిస్తాడట.

మంచు లక్ష్మికి కొత్త అనుభూతి

మోహన్ బాబు కూతురు లక్ష్మీ మంచు ఇప్పుడు రెండు రకాలుగా థ్రిల్ అవుతోంది. ఓపక్క రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న 'డిపార్ట్ మెంట్' హిందీ సినిమాలో నటిస్తుంటే... అదే సమయంలో మరోపక్క ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న 'కడల్' సినిమాలో నటించడం ఆమెకు కొత్త అనుభూతినిస్తోంది. ముఖ్యంగా మణిరత్నం సినిమా పట్ల ఆమె భావోద్వేగాలను తట్టుకోలేకపోతోంది. 'చిన్నప్పటి నుంచీ మణిరత్నం సినిమాలు చూసి పెరిగాను. ముఖ్యంగా గీతాంజలి సినిమా నా మీద ఎంతో ప్రభావాన్ని చూపింది' అని లక్ష్మి చెబుతోంది. అటువంటి మణి నుంచి ఫోన్ రాగానే థ్రిల్ తో బాటు కాస్త నెర్వస్ కూడా ఫీలయిందట. అయితే, మణి కథ చెప్పిన తీరు ఆమెను కుదుటపరచింది. పొతే, 'కడల్' సినిమాలో తిరునల్వేలి తమిళ మాండలికంలో మాట్లాడే నెగటివ్ పాత్రను ఆమె పోషిస్తోంది. ఇందులో సమంతా, గౌతమ్ జంటగా నటిస్తున్నారు.    

చిన్న సినిమా తీస్తున్న పెద్ద దర్శకుడు!


తమ వేతనాలు పెంచాలంటూ తమిళ చిత్ర పరిశ్రమలోని కార్మికులు గత పది రోజుల నుంచీ సమ్మె చేస్తుండడంతో తమిళ సినిమాల షూటింగులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇలా నిలిచిపోయిన చిత్రాలలో విజయ్, కాజల్ జంటగా మురుగదాస్ రూపొందిస్తున్న 'తుపాకి' సినిమా షూటింగు కూడా ఉంది. దాంతో ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో తెలియక తారలు, దర్శకులు సతమతమవుతున్నారట.
     ఈ నేపథ్యంలో ఈ సమయాన్ని మరో కార్యక్రమానికి వినియోగించుకోవాలని దర్శకుడు మురుగదాస్ నిర్ణయించుకున్నాడు. పది నిమిషాల పాటు సాగే ఓ షార్ట్ ఫిలిం రూపొందించే ప్లాన్ చేస్తున్నాడు. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథగా దీనిని తెరకెక్కిస్తాడట. ప్రస్తుతం కొత్త హీరో హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఇటీవల తన ఇంటి సమీపంలో కొంతమంది టీనేజర్లు కలిసి మాట్లాడుకోవడం మురుగదాస్ చెవిన పడిందట. వారి సంభాషణ నుంచే ఈ కథకు ఐడియా తట్టిందట!   
 

Related Posts Plugin for WordPress, Blogger...