ముందు తరం నటులతో ఇప్పటి తరం నటులను పోల్చడం అనేది ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. అయితే, ఆ పోలిక కాస్త సమంజసంగా, అర్ధవంతంగా వుండాలి. అప్పుడే పోల్చిన వాళ్లకీ, పోల్చబడిన వాళ్లకీ గౌరవం. అయితే, ఇప్పుడు మన టాలీవుడ్ లో అలాంటి పోలికలేవీ లేవనే చెప్పాలి. ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్లని ఎవరెవరితోనో పోల్చేస్తున్నారు. అసలు ఎవరిని ఎవరితో పోలుస్తున్నామన్న స్పృహ కూడా కొందరికి వుండదు. ఆమధ్య 'డేంజర్' సినిమా తీస్తున్న టైం లో కలర్స్ స్వాతిని 'కాసుకోండి... మరో సావిత్రి వచ్చేస్తోంది' అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు దర్శకుడు దశరథ్ కాజల్ ని సౌందర్యతో పోలుస్తున్నాడు. "మిస్టర్ పెర్ ఫెక్ట్ సినిమాలో కాజల్ నటన సౌందర్యను మరపించేలా వుంది. భవిష్యత్తులో తెలుగుతెరకు తను మరో సౌందర్య అవుతుంది" అంటూ ఈ రోజు ప్రెస్ మీట్ లో స్తోత్రం అందుకున్నాడు దశరథ్. అది విన్న మీడియా వాళ్లు నవ్వుకున్నారు!
No comments:
Post a Comment