సరైన సినిమాలు లేక, సక్సెస్ అసలే లేక వెనుకపడిపోయిన నితిన్ తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని పొందాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'సై' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వచ్చిన ఆఫర్ మాత్రం గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. ప్రభాస్ కథానాయకుడుగా రాజమౌళి రూపొందించే సినిమాలో ఓ ముఖ్య పాత్రకు నితిన్ సెలెక్ట్ అయ్యాడు. రాజమౌళి అడగ్గానే నితిన్ వెంటనే అంగీకరించినట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు నిర్మించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తను రూపొందిస్తున్న 'ఈగ' సినిమా పూర్తయ్యాక ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రారంభిస్తాడు.
No comments:
Post a Comment