సిద్ధార్థ్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు, నిర్మాత 'దిల్' రాజు బ్యానర్ వాల్యూను కూడా మరింత పెంచిందని చెప్పచ్చు. దానికి కారణం, మంచి కుటుంబకథను చక్కని స్క్రీన్ ప్లే తో చెప్పడమే! అందుకే, దిల్ రాజు ఇప్పుడు మళ్లీ సిద్ధార్థ్ తో తీస్తున్న 'ఓ మై ఫ్రెండ్' సినిమాకు కూడా ఫేమిలీ డ్రామాతో కూడిన కథనే ఎంచుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవదీప్, హన్సిక మరో జంటగా నటిస్తున్నారు.
No comments:
Post a Comment