e-cigarette review Ping Yahoo GOSSIPS: నేటి వార్తలు....టూకీగా

Tuesday, April 19, 2011

నేటి వార్తలు....టూకీగా

*  కథానాయిక తాప్సీ తొలిసారిగా 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమాకు డబ్బింగ్ చెప్పింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 22 న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజ్ చెప్పాడు.
*  వైభవ్, స్నేహ జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తమిళంలో రూపొందిన 'గోవా' సినిమాని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ వారంలో పాటల్ని రిలీజ్ చేస్తారు.
*  తెలుగులో వచ్చిన 'వేదం' సినిమా తమిళ రీమేక్ అయిన 'వానం' ఈ నెల 29 న రిలీజ్ అవుతోంది. అనుష్క, శింబు, భరత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అక్కడ కూడా క్రిష్ దర్శకత్వం వహించాడు. 
*  నయనతార ప్రధాన పాత్రలో తన దర్శకత్వంలో త్వరలో ప్రభుదేవా ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడని కోలీవుడ్ సమాచారం. మరో విశేషమేమిటంటే, ఈ చిత్రాన్ని వీరిద్దరే నిర్మిస్తారట కూడా. సంపాదించుకున్న నాలుగు డబ్బుల్నీ ప్రభుదేవా ఇలా ఖర్చుపెట్టే ప్లాన్ వేస్తున్నాడేమో!
*  ఆమధ్య పవన్ కల్యాణ్ నటించిన 'పులి' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రియ మళ్లీ ఇప్పుడు 'కందిరీగ' సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ చేస్తోందట.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...