నిన్నటి దాకా సినిమా రంగంలో ఒకరిని మరొకరు గౌరవించుకుంటూ, ఆలింగనాలు చేసుకున్న చిరంజీవి-బాలకృష్ణ, ఇప్పుడు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. రాజకీయాలలో ఇద్దరూ చెరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పైచేయి కోసం ఇద్దరూ పోటీపడుతున్నారు. 'చిరంజీవిపై పోటీకి సై' అంటూ నిన్న బాలకృష్ణ ప్రకటించడంతో, ఈ రోజు చిరంజీవి దానిని లైట్ తీసుకున్నారు. బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదనీ, దానిని తాను లైట్ తీసుకుంటానని ఈ రోజు తిరుపతిలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంచితే, బాలకృష్ణ మాత్రం చిరంజీవిపై విమర్శల స్పీడు బాగా పెంచేశారు. ఈవేళ విశాఖపట్నంలో మరింత దూకుడు ప్రదర్శించారు. తనను ఒకరు బాలుడు అన్నారనీ, అలాంటి వారు తనని ఒక వైపే చూశారనీ, కావాలంటే తన మరో రూపం కూడా చూపిస్తాననీ బాలకృష్ణ ఆవేశంగా అన్నారు. 'కోట్లాది రూపాయలకు పార్టీని అమ్ముకున్న వాళ్ళా నన్ను విమర్శించేది?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కావాలని కొందరు కలలు కంటున్నారనీ, అలాంటి వారు ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరితూగరనీ, చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ పరోక్షంగా విమర్శించారు. ఈ మాటల యుద్ధం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి! | |
Monday, January 23, 2012
చిరంజీవిపై మళ్లీ విరుచుకుపడ్డ బాలకృష్ణ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment