ఇటీవల విడుదలైన 'బిజినెస్ మేన్' చిత్రాన్ని హిందీలో కూడా మహేష్ బాబు హీరోగా రీమేక్ చేస్తానని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రకటించిన సంగతి మనకు తెలుసు. అయితే, తాజా సమాచారం ప్రకారం మహేష్ హిందీ వెర్షన్లో నటించడం లేదని తెలుస్తోంది. తెలుగు చిత్రాల కమిట్ మెంట్స్ వుండడం వల్ల మహేష్ బాలీవుడ్ ఎంట్రీని వాయిదా వేసుకున్నాడట. అందుకని ఈ చిత్రాన్ని హిందీలో రణబీర్ కపూర్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రాం గోపాల్ వర్మ నిర్మిస్తాడట. దర్శకత్వం మాత్రం పూరీనే చేస్తాడు. ఇటీవల 'బిజినెస్ మేన్' చిత్రాన్ని ముంబైలో రణబీర్ కి వర్మ చూపించాడనీ, అతనికి కూడా సినిమా నచ్చిందనీ అంటున్నారు. మరో విశేషం ఏమిటంటే, హిందీలో కాజల్ కథానాయికగా నటిస్తుందట!
No comments:
Post a Comment