* గోవా బ్యూటీ ఇలియానా తాను నటిస్తున్న తొలి హిందీ చిత్రం బర్ఫీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందట. రణబీర్ కపూర్, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. * చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'ఋషి' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులోని ప్రసాద్ ఐ మాక్స్ లో జరిగింది. ప్రముఖ నటుడు కమలహాసన్ వీటిని విడుదల చేయగా, డి.రామానాయుడు తొలి సీడీని స్వీకరించారు. * సినీ తారల క్రికెట్ టోర్నీ (సీసీఎల్- 2) లో నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు గెలిచి సెమీస్ లోకి ప్రవేశించింది. వెంకటేష్ నేతృత్వంలోని తెలుగు వారియర్స్ టీం బెంగాల్ టైగర్స్ ను మట్టికరపించింది. * దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్ వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 3 న హైదరాబాదు జూబ్లీ హిల్స్ లోని ఎఫ్.ఎన్.సీసీలో మిత్రులకు పార్టీ ఇస్తున్నాడు. మీడియాను కూడా పిలుస్తున్నాడట. * ప్రముఖ గీత రచయిత వేటూరి పేరుపై విజయనగరంకు చెందిన ఆత్రేయ స్మారక కళాపీఠం ఇచ్చే వార్షిక పురస్కారాన్ని ఈ ఏడాది సంగీత దర్శకుడు మణిశర్మకు ప్రదానం చేశారు. వేటూరి జయంతి సందర్భంగా నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. | ||
Sunday, January 29, 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment