విడుదలకు ముందే ప్రివ్యూల పరంగా 'గగనం' సినిమాకు శతప్రదర్శనోత్సవాన్ని జరిపేసేలా వున్నాడు నిర్మాత దిల్ రాజు. మొన్న, నిన్న హైదరాబాదులో ప్రివ్యూల మీద ప్రివ్యులు వేసేసిన నిర్మాత ఈ రోజు విశాఖ, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలలో కూడా వేస్తున్నాడు. అభిమానులని, నగర ప్రముఖుల్ని ఈ షోలకి ఇన్వయిట్ చేసాడు. ఈ షోలకి యూనిట్ అటెండ్ అవడానికి ఈ రోజు ప్రత్యేకంగా 10 లక్షలు వెచ్చించి, చార్టెడ్ ఫ్లయిట్ ను కూడా బుక్ చేసాడు. ఈ రోజు పొద్దున్నే అందులో నాగార్జున, ప్రకాష్ రాజ్, దిల్ రాజ్, పూనం కౌర్ తదితర యూనిట్ బృందమంతా బయలు దేరి వెళ్లి, ఆంధ్రా అంతటా చక్కర్లు కొడుతోంది. ఒక్కో షోకి ఒక్కో పట్టణంలో ఉండేలా ప్లాన్ చేసుకుని ఆయా థియేటర్లను విజిట్ చేస్తున్నారు. అక్కడ అభిమానుల కోలాహలం కూడా బాగానే వుంది. ఈ సినిమా ఓ కొత్త తరహా ప్రయోగం కావడంతో, జనం చూస్తారో, లేదోనన్న భయంతో, నిర్మాత ప్రమోషన్ లో భాగంగా ఈ కొత్త పోకడను ఎంచుకున్నాడన్న మాట!
No comments:
Post a Comment