నాగార్జున హీరోగా నటించే సోషియో ఫ్యాంటసీ చిత్రం 'ఢమరుకం' షూటింగ్ రేపే (ఫిబ్రవరి 12) ప్రారంభమవుతోంది. మినిమం గ్యారంటీ దర్శకుడిగా కామెడీ చిత్రాలు రూపొందించే శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో దీనిని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారు. అలాగే ఈ సబ్జక్ట్ కి కాస్ట్యూమ్స్ పరంగా కూడా రిచ్ నెస్ అవసరమట. ఆ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఫ్యాంటసీ కథాంశం మిళితమైనందువల్ల గ్రాఫిక్స్ కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉందనీ, సుమారు 50 నిమిషాల పాటు స్క్రీన్ మీద ఈ గ్రాఫిక్స్ మాయాజాలం ప్రేక్షకులను మరో లోకంలో విహరింపజేస్తుందట. ఇందులో నటించే హీరోయిన్ గా ఇప్పటికే అనుష్కను ఎంపిక చేసారు.
No comments:
Post a Comment