ప్రేమికులకి వేలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14 చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా కూడా ప్రేమికులు, అందులోనూ పెళ్లి కాని ప్రేమికులు తప్పకుండా కలుసుకుని, హ్యాపీగా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే, ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ ప్రేమికులుగా, ఖరీదైన లవ్వర్స్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా, నయనతారలు ఆ రోజు అసలు కలుసుకునేలానే లేరు. ఎందుకంటే, ఆ రోజు ఇద్దరూ చెరో చోటా ఉంటున్నారట! ప్రభుకైతే అస్సలు ఖాళీ లేదట. ఓపక్క తను జయం రవి, హన్సికలతో రూపొందించిన 'ఎంజియమ్ కాదల్' సినిమా ఫిబ్రవరి 26 న రిలీజ్ అవుతోంది. ఆ సినిమా ఫినిషింగ్ వర్క్ లో చాలా బిజీనట. అలాగే, మరో పక్క ముంబై లో సంజయ్ లీలా భన్సాలీ ఇతని దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం క్లైమాక్స్ కి సంబంధించిన డిస్కషన్స్ వున్నాయి. 'ఇన్ని పనులతో ఇక వేలెంటైన్స్ డే సెలెబ్రేషన్ కి టైమెక్కడ?' అంటున్నాడు ప్రభు. మరి, ఇప్పుడే ఇలా అంటే, రేపు పెళ్లయ్యాక అసలు నయన్ కి టైం కేటాయిస్తాడా?
No comments:
Post a Comment