నిఖిల్ హీరోగా నూతన దర్శకుడు చిన్ని కృష్ణ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న 'వీడు తేడా' సినిమా షూటింగ్ ఈ రోజు (ఫిబ్రవరి 10) ఉదయం హైదరాబాదులోని అన్నపూర్ణా స్టుడియోలో ప్రారంభమైంది. తొలి షాట్ కు ప్రముఖ నిర్మాత రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ, "నాకిది ఏడవ సినిమా. కథ, దానిని దర్శకుడు చెప్పిన విధానం నచ్చాయి. నాకు మంచి సినిమా అవుతుందనుకుంటున్నాను" అన్నాడు. దర్శకుడు చిన్ని కృష్ణ చెబుతూ, "దర్శకుడు వినాయక్ వద్ద పనిచేసాను. అలాగే, 'కొత్త బంగారు లోకం' సినిమాలో హాస్టల్ వార్డెన్ గా నటించాను. ఇది నా తొలి సినిమా. బాగా తీస్తానన్న నమ్మకం వుంది" అన్నారు. చక్రి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో పూజా బోస్ హీరోయిన్ గా నటిస్తోంది.
No comments:
Post a Comment