ఈమధ్య కాలంలో ఎప్పుడూ జరగనట్టుగా ఫిబ్రవరి 25 న, ఒకే రోజున నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ' రాజ్', 'అహ నా పెళ్ళంట', 'కుదిరితే కప్పు కాఫీ', 'యమకంత్రీ' సినిమాలు ఆ రోజున విడుదలవుతున్నాయి. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించిన 'రాజ్' లో సుమంత్ హీరోగా, ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా నటించారు. 'అహ నా పెళ్ళంట'లో అల్లరి నరేష్ హీరోగా నటించగా, 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలో వరుణ్ శందేశ్ హీరోగా నటించాడు. ఇక ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన 'యమకంత్రి' సినిమాలో విజయ్, నయనతార జంటగా నటించారు. ఈ నాలుగు సినిమాల్లో ఏవి హిట్ అవుతాయో, ఏవి ఫట్ అవుతాయో చూడాలి!
No comments:
Post a Comment