ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా లేకుండా వరుస ఫ్లాపుల్లో వున్న సిద్ధార్థ్ ఖాళీగా మాత్రం లేడు. ఏదో ఒక సినిమా వస్తూనే వుంది. ఇటీవల వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, దిల్ రాజు ఇతనితో మరో సినిమా ప్లాన్ చేసాడు. నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా 'ఓ మై ఫ్రెండ్' అన్న పేరు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగు బుధవారం నాడు హైదరాబాదులో లాంచనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగును ఫిబ్రవరి 21 నుంచి జరుపుతారు. ఇదిలా ఉంచితే, ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్య మీనన్ ని ఎంపిక చేసారట. ఈమెను హీరో సిద్దార్దే రికమండ్ చేసినట్టు తెలుస్తోంది. మరో పక్క సిద్ధార్థ్ ప్రస్తుతం నటిస్తున్న తెలుగు, తమిళ చిత్రం '180' లో కూడా నిత్యానే కథానాయిక. ఒక సినిమా రిలీజ్ కాకుండానే వరుసగా మరో సినిమాలో కూడా నిత్యాకు ఛాన్స్ ఎందుకిచ్చాడబ్బా? అంటూ టాలీవుడ్ జనం వేరే అర్థాలు తీస్తున్నారు!
No comments:
Post a Comment