సినిమా ఇండస్ట్రీలో తారలు లైమ్ లైట్ లో వున్నప్పుడు సంపాదించుకున్నది జాగ్రత్త చేసుకోకపోతే ఆ తర్వాతి కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ బాపతు మనుషుల్ని సినిమా రంగంలో చాలా మందిని చూసాం. రాధిక చెల్లెలు, ఒకప్పటి కథానాయిక నిరోషా కూడా ఇప్పుడీ రకం మనుషుల్లో చేరిపోయింది. ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా 'సింధూర పువ్వు' లో తనతో పాటు కలిసి నటించిన రాంకీ ని పెళ్లి చేసుకున్న నిరోషా, ఇప్పుడు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నట్టు తెలుస్తోంది.
తను ఆర్టిస్టుగా మంచి పొజిషన్ లో ఉండగానే ఈ నటి రాంకీ ని మేరేజ్ చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి ఇద్దరికీ అవకాశాలు తగ్గాయి. దాంతో నిరోషా టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. అయితే, ఆమధ్య ఈ దంపతులు చెన్నయ్ లోని జెమినీ సర్కిల్ ప్రాంతంలోని పార్శెన్ కాంప్లెక్స్ లో వున్న రెండు ఫ్లాట్స్ ని తనఖా పెట్టి, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి 50 లక్షలు అప్పుగా తీసుకున్నారట. ఎన్ని నోటీసులిచ్చినా, తిరిగి ఆ మొత్తం చెల్లించకపోవడంతో సదరు బ్యాంకు అధికారులు ఆ ఫ్లాట్స్ ను వేలం వేయడానికి సిద్ధం అవుతున్నారని కోలీవుడ్ సమాచారం.
తను ఆర్టిస్టుగా మంచి పొజిషన్ లో ఉండగానే ఈ నటి రాంకీ ని మేరేజ్ చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి ఇద్దరికీ అవకాశాలు తగ్గాయి. దాంతో నిరోషా టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. అయితే, ఆమధ్య ఈ దంపతులు చెన్నయ్ లోని జెమినీ సర్కిల్ ప్రాంతంలోని పార్శెన్ కాంప్లెక్స్ లో వున్న రెండు ఫ్లాట్స్ ని తనఖా పెట్టి, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి 50 లక్షలు అప్పుగా తీసుకున్నారట. ఎన్ని నోటీసులిచ్చినా, తిరిగి ఆ మొత్తం చెల్లించకపోవడంతో సదరు బ్యాంకు అధికారులు ఆ ఫ్లాట్స్ ను వేలం వేయడానికి సిద్ధం అవుతున్నారని కోలీవుడ్ సమాచారం.
No comments:
Post a Comment