e-cigarette review Ping Yahoo GOSSIPS: రామోజీరావుతో బంధం ఈనాటిది కాదంటోన్న దాసరి

Wednesday, December 29, 2010

రామోజీరావుతో బంధం ఈనాటిది కాదంటోన్న దాసరి

 
 
 
           ఒకప్పుడు 'ఈనాడు' రామోజీరావుకి, దర్శకుడు దాసరి నారాయణరావుకి మధ్య ఒక విధమైన పోటీ వుండేది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయి. ఇది తెలుగువారందరికీ తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా వారి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇద్దరూ తరచూ కలుసుకోవడం కూడా జరుగుతోంది. కాగా, దాసరి నిర్మిస్తున్న 'ప్రేమాభిషేకం' మెగా సీరియల్ ను ఈటీవీలో ప్రసారం చేస్తున్నారు. దీనికి మంచి ప్రేక్షకాదరణ కూడా లభించి, మంచి రేటింగ్ వచ్చింది. ఇప్పుడీ సీరియల్ 600 ఎపిసోడ్ ల ప్రసారాన్ని పూర్తిచేసుకుంది. ఈ నేపధ్యంలో ఈరోజు (డిసెంబర్ 28 ) హైదరాబాదులో దాసరి ఆఫీసులో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.
          ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ, "ముందుగా ఈ సీరియల్ ను ఈటీవీలో ఇన్నాళ్లుగా ప్రసారం చేస్తున్న రామోజీరావు గారికి థాంక్స్ చెపుతున్నాను. ఆయనకు, నాకు మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం వుంది. నా 'తూర్పు-పడమర' చిత్రం షూటింగు వారింట్లో పదిహేను రోజులపాటు చేసాను. అయితే, మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మా బంధం మళ్లీ  ఎంతో గట్టిపడింది. పొతే, మా ఆవిడకు సీరియల్స్ అంటే ఎంతో ఇష్టం. తన కోసమే ఈ సీరియల్స్ నిర్మిస్తున్నాను. సీరియల్ ప్రారంభించడమే మన  చేతిలో వుంటుంది. ముగింపు మన చేతిలో వుండదు. 'ప్రేమాభిషేకం' ప్రారంభమై మూడేళ్లయింది. 'ప్రేమాభిషేకం' సినిమాకు చేసినట్టుగా దీనికి కూడా సిల్వర్ జూబిలీ ఘనంగా చేస్తాను" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఈటీవీ డైరెక్టర్ బాపినీడు, అజయ్ శాంతి, కొమ్మనాపల్లి గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...