తెలంగాణా ఉధ్యమం నేపధ్యంలో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ రూపొందిస్తున్న 'జై బోలో తెలంగాణా' చిత్రం షూటింగ్ పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు (డిసెంబర్ 28 ) హైదరాబాదులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, "అందరి సహకారంతో రేపటితో షూటింగ్ పూర్తవుతోంది. మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేసి, జనవరి మొదటి లేదా రెండో వారంలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాం" అన్నారు. దేశపతి శ్రీనివాస్ చెబుతూ, రైతు సమస్యలపై చిత్రాలు వచ్చాయి కానీ, ఒక ఉద్యమం పై ఇంతవరకు సినిమాలు రాలేదు. ఇది తొలి చిత్రమవుతుంది. ఉధ్యమంలో పాల్గొన్నవారే ఈ చిత్రంలో నటించడం విశేషం" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా జూలూరి గౌరీశంకర్, మల్లేపల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ, చీవీయాల్ తదితరులు పాల్గొన్నారు. |
Wednesday, December 29, 2010
'జై బోలో తెలంగాణా' పూర్తయింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment