ప్రముఖ హాస్య నటుడు దివంగత రాజబాబు జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 13 న ఆయన పేరిట హాస్య స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాజబాబు పుట్టిపెరిగిన రాజమండ్రి నగరంలో ఈ కార్యక్రమాన్ని వేలాది మంది అభిమానుల సమక్షంలో జరపనున్నట్టు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా గోదావరీ తీరాన తొమ్మిది అడుగుల రాజబాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారాయన. ఇది రాజబాబు 75 వ జన్మదినం కాబట్టి, తెలుగు సినీ రంగానికి చెందిన 75 మంది హాస్యనటులను ఘనంగా సత్కరిస్తామన్నారు. వీరిలో సీనియర్ నటుడిని రాజబాబు అవార్డుతో ప్రత్యేకంగా సన్మానిస్తామన్నారు. ఇంత మంది హాస్య నటులని ఒకే వేదికపై సన్మానించడం గిన్నిస్ రికార్డు అవుతుందట. |
Thursday, January 6, 2011
ఫిబ్రవరి 13 న హాస్య స్వర్ణోత్సవం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment