'జయం' సినిమాతో కధానాయికగా పరిచయమైన సదా ఆ తర్వాత కొన్ని సినిమాలలో చేసినా అంతగా రాణించలేదనే చెప్పాలి. అటు తమిళంలో కూడా క్లిక్ కాలేకపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగులో ఓ చిత్రంలో నటిస్తోంది. శివాజీ హీరోగా సూర్యచక్ర పిక్చర్స్ నిర్మించే సినిమాలో సదాని కధానాయికగా ఎంపిక చేసారు. ఎస్.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభమవుతుంది. హాస్యభరితంగా రూపొందే ఈ చిత్రాన్ని తాడి గనిరెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, జీవా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తారు. |
Wednesday, January 12, 2011
సదా కి ఒక సినిమా వచ్చింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment