'మగధీర' సినిమాతో మాంచి కమర్షియల్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, అందుకు భిన్నంగా 'ఆరెంజ్' సినిమాలో సోబెర్ క్యారెక్టర్ చేయడంతో జనానికి అది ఎక్కలేదు. 'ఇటువంటి సినిమాలు వద్దు బాబూ... నువ్వు పక్కా మాస్ సినిమాలే చెయ్" అంటూ ప్రేక్షకులు ఆ సినిమాని ఫ్లాప్ చేసి, వార్నింగ్ ఇచ్చారు. ఆ అనుభవంతో అంతకు ముందే స్టార్ట్ చేసిన 'మెరుపు' సినిమా షూటింగును కూడా ఆపేశారు. చరణ్ ఇమేజ్ కి అనుగుణంగా కధకు రిపేర్ చేయడం మొదలెట్టారు. తాజాగా ఈ సినిమా కధ ఓకే అయిందని రామ్ చరణ్ చెబుతున్నాడు. "మెరుపు కధ ఇప్పుడు ఫైనలైజ్ అయింది. సూపర్ గా వచ్చింది. ఫుల్ ఎంటర్ టైనర్ గా, కమర్షియల్ మూవీగా ఉండేలా కధను రూపొందించడం జరిగింది" అంటున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కూడా అంటున్నాడు. రెండు, మూడు రోజుల్లో ఇండస్ట్రీ స్ట్రయిక్ పూర్తవుతుందనీ, 'మెరుపు' షూటింగులో పాల్గొంటాననీ చెబుతున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది |
Wednesday, January 12, 2011
రామ్ చరణ్ 'మెరుపు' కధ ఫైనలైజ్ అయింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment