ఇప్పుడు టాలీవుడ్ లో కుర్ర హీరోలనే కాకుండా, సీనియర్ హీరోలని కూడా ఆకట్టుకుంటున్న కధానాయిక గా దీక్షా సేథ్ ను చెప్పుకోవచ్చు. రవితేజ 'మిరపకాయ్' లోనూ, గోపీచంద్ 'వాంటెడ్' లోనూ దర్శకులు ఎలా చేయమంటే అలా తన అందాలను విశాలంగా ఆరబోసిందట. అందుకే, ఇప్పుడు చాలామంది తనే కావాలని 'దీక్ష' పడుతున్నారు. ఇదిలావుంచితే, ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల చిత్రాలలో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదంటోంది దీక్ష. 'అటువంటి సినిమాల్లో నటించడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. దానికి కారణం ఇన్ సెక్యురిటి. అయితే, నాకా బాధ లేదు. నేనెవరికీ కంగారుపడిపోను. ఎంతమంది వున్నా నాకేం పర్వాలేదు. వేదంలో చేసాను కదా? అయినా నాకు పేరొచ్చింది కదా?' అంటోంది. ప్రస్తుతం తను తెలుగు నేర్చుకుంటోంది. 'మరో ఏడు నెలలలో నా డబ్బింగ్ నేనే చెప్పేసుకుంటాను' అని కూడా చెబుతోంది. |
Thursday, January 6, 2011
'ఎంతమంది వున్నా పర్వాలే'దంటోన్న దీక్షా సేథ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment