e-cigarette review Ping Yahoo GOSSIPS: ఈ 23 నుంచి 'ఎవడు' షూటింగ్

Wednesday, February 8, 2012

ఈ 23 నుంచి 'ఎవడు' షూటింగ్

రామ్ చరణ్ కథానాయకుడుగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'బృందావనం' ఫేం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. సమంతా ప్రధాన కథానాయికగా, ఎమీ జాక్సన్ రెండో కథానాయికగా రూపొందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు ఈ నెల 23 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వంశీ చెప్పాడు. ప్రస్తుతం చరణ్ చేస్తున్న 'రచ్చ' సినిమా షూటింగు త్వరలో పూర్తి కానుంది. ఆ వెంటనే 'ఎవడు' సినిమా షూటింగులో చరణ్ పాల్గొంటాడన్న మాట. ఈ చిత్రాన్ని వచ్చే సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చరణ్ కొత్త లుక్ తో కనిపిస్తాడట.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...