కరీనా కపూర్ - ఇమ్రాన్ ఖాన్ కలిసి నటించిన 'ఏక్ మై ఔర్ ఏక్ తూ' చిత్రం ఈ నెల 10 వ తేదీన విడుదల కాబోతోంది. శాకున్ బత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అభిమానుల అంచనాలు భారీగానే వున్నాయి. ఈ నేపథ్యంలోనే కరీనా తన మనసులోని మాట బైట పెట్టింది. షారుఖ్ ఖాన్... సల్మాన్ ఖాన్... అమీర్ ఖాన్ ... సైఫ్అలీఖాన్ ...వంటి అగ్ర కథా నాయకులందరితోనూ తాను నటించాననీ, యంగ్ హీరోల కాంబినేషన్లో కూడా ఎక్కువ సినిమాలు చేయాలని వుందని చెబుతోంది. ఓ వైపున అమీర్ ఖాన్ సరసన 'తలాష్' లో నటిస్తూ... మరో వైపున ఆయన మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్ జోడీ గా నటించడం తనకి కొత్త అనుభూతిని కలిగించిందని అంటోంది. 'ఏక్ మై ఔర్ ఏక్ తూ' సినిమాలో ప్రేమ సన్నివేశాలు యువతరం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయని కరీనా అభిప్రాయపడుతోంది.
No comments:
Post a Comment