తాజాగా మరో తెలుగు సినిమా హిందీలోకి రీమేక్ కానుంది. గత సంవత్సరం నందినీ రెడ్డి డైరెక్షన్లో నాని, నిత్యా మీనన్ జంటగా రూపొందిన 'అలా మొదలైంది' చిత్రం రీమేక్ హక్కుల్ని మంచి రేటుకి బాలీవుడ్ ఫిలిం మేకర్ వాసు భగ్నాని తీసుకున్నారు. ఈ చిత్రాన్ని తన కొడుకు జాకీ ని హీరోగా పెట్టి హిందీలో పునర్నిర్మించే ఆలోచనలో వాసు భగ్నాని ఉన్నాడట. జాకీ ఇంతకు ముందు 'ఫాల్తూ' అనే సినిమాలో నటించాడు. 'అలా మొదలైంది' హిందీ వాతావరణానికి కూడా సూట్ అవుతుందన్న అంచనాతో, తన కొడుకుని హీరోగా నిలబెట్టచ్చన్న ఆశతో ఆయనీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, ఇందులో నటించే హీరోయిన్ వివరాలు తెలియాల్సి వుంది.
No comments:
Post a Comment