బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ ఈ వేళ హిందీ చిత్రరంగంలో బిజీ హీరోయిన్. ఆమెకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ కారణం గానే ఆమె ప్రస్తుతం తెలుగు - తమిళ భాషల్లో సినిమాలు చేయడం లేదు. అప్పుడెప్పుడో 'మల్లీశ్వరి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మత్తెక్కించిన ఈ సుందరి ఆ తరువాత బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైపోయింది. అయితే ఇప్పుడామె కమల్ హాసన్ సరసన ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న 'తలైవన్ ఇరుకిరన్' అనే భారీ బడ్జెట్ సినిమాలో ఆమె కమల్ సరసన కనువిందు చేయనుంది. ఇక 'కొచ్చాడియాన్' సినిమాలో రజనీ కాంత్ సరసన కథానాయికగా కత్రినాకైఫ్ బాగుంటుందని భావించిన కె.ఎస్.రవికుమార్, ఆ విషయమై ఆమెని కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ...అమీర్ ల సినిమాలతో చాలా బిజీగా వున్న కత్రినా... 'ఏక్ థా టైగర్ ' అనే సినిమాలో పోరాట సన్నివేశాల్లో పాల్గొనేందుకు ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందని తెలుస్తోంది.
ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న 'తలైవన్ ఇరుకిరన్' అనే భారీ బడ్జెట్ సినిమాలో ఆమె కమల్ సరసన కనువిందు చేయనుంది. ఇక 'కొచ్చాడియాన్' సినిమాలో రజనీ కాంత్ సరసన కథానాయికగా కత్రినాకైఫ్ బాగుంటుందని భావించిన కె.ఎస్.రవికుమార్, ఆ విషయమై ఆమెని కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ...అమీర్ ల సినిమాలతో చాలా బిజీగా వున్న కత్రినా... 'ఏక్ థా టైగర్ ' అనే సినిమాలో పోరాట సన్నివేశాల్లో పాల్గొనేందుకు ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందని తెలుస్తోంది.
No comments:
Post a Comment