రామ్ చరణ్ కేరళ వెళ్లాడు... తనతో బాటు ముద్దుగుమ్మ తమన్నాని కూడా వెంట తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెతో రొమాన్స్ చేస్తూ... ఆటాపాటా అందుకున్నాడు. అయితే ఈ తతంగమంతా 'రచ్చ' సినిమా కోసమేలెండి! సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం కేరళలోని పలు అందమైన లొకేషన్లలో జరుగుతోంది. హీరో హీరోయిన్లు రామ్ చరణ్, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన హీరో ఇంట్రడక్షన్ పాటను హైదరాబాదులో చిత్రీకరించారు. ఇదిలా ఉంచితే, ఈ సినిమా ఆడియోను మహాశివరాత్రికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తన నుంచి అభిమానులు ఆశించే కమర్షియల్ హంగులన్నీ ఈ సినిమాలో ఉండేలా చరణ్ చూసుకుంటున్నాడు. మార్చి నెలలో ఈ 'రచ్చ' చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.
No comments:
Post a Comment