రమణీయ కావ్యమైన రామాయణాన్ని అపురూప దృశ్య కావ్యంగా మలిచారు దర్శకుడు బాపు. శ్రీ రాముడిగా బాలకృష్ణ, సీతగా నయనతార నటించిన ఈ సినిమా పిన్నల నుంచి పెద్దల వరకూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. చాలాకాలం తరువాత మనసుకి ఊరట కలిగించే ఓ సినిమాని చూశామంటూ ఆడియన్స్ ఆనందించారు. ఇప్పుడీ సినిమా మలయాళంలోకి అనువాదమవుతోంది. డబ్బింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14 న మలయాళ నూతన సంవత్సరం కావడంతో, ఆ రోజున ఈ సినిమాని అక్కడ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ పౌరాణిక చిత్రాన్ని హిందీ - ఇంగ్లిష్ భాషల్లోకి కూడా అనువదించాలని నిర్మాత యలమంచలి సాయిబాబు, అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారట!
No comments:
Post a Comment