ఇద్దరు యువ కథానాయకులతో అశ్వనీదత్ రెండు భారీ చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా రూపొందించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఓ వైపున 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో మహేష్ బాబు... మరో వైపున 'రచ్చ' సినిమాతో రామ్ చరణ్... ఎన్టీఆర్ సినిమాతో శ్రీను వైట్ల... రానాతో 'కృష్ణం వందే జగద్గురుం' సినిమాతో క్రిష్ బిజీ బిజీగా ఉన్నారు. కాబట్టి వాళ్ల తరువాత ప్రాజెక్ట్ గా ఈ సినిమాలు తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది.
ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు కావడం వల్ల బహుశా ఆయన సినిమా షూటింగ్ ఆరోజు ప్రారంభమౌతుందని అంటున్నారు. దాదాపు అందరి హీరోలతోనూ సినిమాలు చేసిన అరుదైన చరిత్ర అశ్వనీదత్ సొంతం. చిరంజీవికి అఖండ విజయాలను అందించిన ఈ అగ్ర నిర్మాత, రామ్ చరణ్ కి కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడనే అంచనాలు అభిమానుల్లో అప్పుడే మొదలయ్యాయి. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం వుం
ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు కావడం వల్ల బహుశా ఆయన సినిమా షూటింగ్ ఆరోజు ప్రారంభమౌతుందని అంటున్నారు. దాదాపు అందరి హీరోలతోనూ సినిమాలు చేసిన అరుదైన చరిత్ర అశ్వనీదత్ సొంతం. చిరంజీవికి అఖండ విజయాలను అందించిన ఈ అగ్ర నిర్మాత, రామ్ చరణ్ కి కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడనే అంచనాలు అభిమానుల్లో అప్పుడే మొదలయ్యాయి. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం వుం
No comments:
Post a Comment