మోహన్ బాబు కూతురు లక్ష్మీ మంచు ఇప్పుడు రెండు రకాలుగా థ్రిల్ అవుతోంది. ఓపక్క రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న 'డిపార్ట్ మెంట్' హిందీ సినిమాలో నటిస్తుంటే... అదే సమయంలో మరోపక్క ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న 'కడల్' సినిమాలో నటించడం ఆమెకు కొత్త అనుభూతినిస్తోంది. ముఖ్యంగా మణిరత్నం సినిమా పట్ల ఆమె భావోద్వేగాలను తట్టుకోలేకపోతోంది. 'చిన్నప్పటి నుంచీ మణిరత్నం సినిమాలు చూసి పెరిగాను. ముఖ్యంగా గీతాంజలి సినిమా నా మీద ఎంతో ప్రభావాన్ని చూపింది' అని లక్ష్మి చెబుతోంది. అటువంటి మణి నుంచి ఫోన్ రాగానే థ్రిల్ తో బాటు కాస్త నెర్వస్ కూడా ఫీలయిందట. అయితే, మణి కథ చెప్పిన తీరు ఆమెను కుదుటపరచింది. పొతే, 'కడల్' సినిమాలో తిరునల్వేలి తమిళ మాండలికంలో మాట్లాడే నెగటివ్ పాత్రను ఆమె పోషిస్తోంది. ఇందులో సమంతా, గౌతమ్ జంటగా నటిస్తున్నారు.
No comments:
Post a Comment