'ఊసరవెల్లి' ఫ్లాప్ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి మరో చిత్రానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తాడని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి వినిపించిన కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం పూర్తి కాగానే, సురేందర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభిస్తారని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి తమ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. బన్నీ స్క్రిప్ట్ కి ఓకే చెప్పడంతో, దానికి మరిన్ని మెరుగులు దిద్దే కార్యక్రమంలో దర్శకుడు వున్నాడిప్పుడు. ఇందులో నటించే కథానాయిక, తదితర వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
No comments:
Post a Comment