e-cigarette review Ping Yahoo GOSSIPS: నేటి వార్తలు.... టూకీగా

Wednesday, February 8, 2012

నేటి వార్తలు.... టూకీగా

*  ఇటీవలే 'గలీ గలీ చోర్ హై' చిత్రంలో నటించిన అందాల తార శ్రియ, తాజాగా మరో హిందీ చిత్రంలో నటిస్తోంది. అయితే, అది ఐటెం సాంగ్ మాత్రమే కావడం విశేషం. సంజయ్ దత్ హీరోగా నటిస్తున్న 'జిల్లా గజియాబాద్' అనే చిత్రంలో స్పెషల్ సాంగులో ఆమె నర్తిస్తోంది. ఈ పాటను ప్రస్తుతం ముంబాయ్ లోని ఫిల్మిస్తాన్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.
*  సుదీర్ బాబు, రెజీనా జంటగా నటించిన 'ఎస్.ఎం.ఎస్' చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాదులోని దసపల్లా హోటల్ లో నిన్న రాత్రి జరిగింది. అలాగే, ఆది పినిశెట్టి నటిస్తున్న 'ఏకవీర' సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది.
*  రవికుమార్ చౌదరి దర్శకత్వంలో అల్లు అరవింద్, దిల్ రాజు, బన్నీ వాసు నిర్మించే చిత్రంలో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. మొదట్లో ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య నటిస్తాడని వార్తలొచ్చాయి.
*  రామ్ చరణ్, తమన్నా జంటగా సంపత్ నంది  డైరెక్షన్లో రూపొందుతున్న 'రచ్చ' సినిమా ఆడియో వేడుకను ఈ నెల 26 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కర్నూలు పట్టణంలో అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుందట.
*  ఇటీవల కన్నడలో ఆర్. చంద్రు దర్శకత్వంలో 'కో కో కోలి కోతి' అనే హిట్ సినిమా వచ్చింది. ఈ సినిమా గురించి తెలుసుకున్న హీరో మహేష్ బాబు ఆ సినిమా ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని చూశారట. దానిని రీమేక్ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...