అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను పరిచయమే అవసరం లేని పేరు ప్రీతీజింటా. బాలీవుడ్ తెరపై భారీ అందాలను ఆరబోసిన ఈ సుందరి తెలుగులో మహేష్ బాబు సరసన 'రాకుమారుడు' ... వెంకటేష్ సరసన 'ప్రేమంటే ఇదేరా!' వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఈ మధ్య ఆమె తెర మీద కన్నా ఎక్కువగా క్రికెట్ స్టేడియమ్స్ లోనే కనిపిస్తోంది. క్రికెట్ వ్యాపారంగా కోట్లు గడించాలనే ఆరాటంతో ముందుకు సాగుతుండటమే అందుకు కారణం. ప్రస్తుతం ఆమె స్వయంగా నడుపుతోన్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ భారీ నష్టాల్లో వున్నట్టు ఆమె ప్రకటించింది. 2010 - 2011 సంవత్సరానికి గాను ఆమె 35 కోట్ల రూపాయల నష్టాన్ని చూపించిందట. ఓ వైపున ఇంతటి నష్టాల్లో క్రీడావ్యాపారాన్నికొనసాగిస్తూ నే మరో వైపున ఆమె ఎయిడ్స్ ఎవేర్ నెస్ అంటూ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం
No comments:
Post a Comment