డ్యాన్స్ మాస్టర్ నుంచి దర్శకుడి స్థాయికి ఎదిగిన ప్రభుదేవా గత కొంత కాలంగా వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో ఆయన తండ్రి సీనియర్ నృత్య దర్శకుడు సుందరం మాస్టర్ కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కుంటున్నాడు. సుందరం నుంచి తనకు భరణం ఇప్పించాల్సిందిగా ప్రముఖ నృత్య దర్శకురాలు తార కోర్టుకెక్కింది. 1964 -72 మధ్య కాలంలో సుందరం దగ్గర తాను అసిస్టెంట్ గా పనిచేశాననీ, ఆ సమయంలో ఆయన తనతో సన్నిహితంగా ఉండేవారనీ, తమకు 1970 లో వివాహం జరిగిందనీ తార మాస్టర్ చెన్నయ్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
"పెళ్ళయిన ఏడాది తర్వాత మాకు ఓ బాబు పుట్టాడు. అందుకు వాడి బర్త్ సర్టిఫికేట్ రుజువుగా ఇస్తున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన నా నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. మా వివాహం గురించి ఎవరికీ చెప్పద్దని హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 100 కోట్లు. పెళ్లి చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టినందుకు 5 కోట్లు, భరణంగా నెలకు 75 వేలు చొప్పున ఇప్పించాల్సిందిగా వేడుకుంటున్నాను" అంటూ ఆమె తన పిటిషన్లో న్యాయమూర్తిని కోరారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి!
"పెళ్ళయిన ఏడాది తర్వాత మాకు ఓ బాబు పుట్టాడు. అందుకు వాడి బర్త్ సర్టిఫికేట్ రుజువుగా ఇస్తున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన నా నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. మా వివాహం గురించి ఎవరికీ చెప్పద్దని హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 100 కోట్లు. పెళ్లి చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టినందుకు 5 కోట్లు, భరణంగా నెలకు 75 వేలు చొప్పున ఇప్పించాల్సిందిగా వేడుకుంటున్నాను" అంటూ ఆమె తన పిటిషన్లో న్యాయమూర్తిని కోరారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి!
No comments:
Post a Comment