
హీరో ఇంట్రడక్షన్ కి సంబంధించిన ఆ సాంగుని ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో మలేసియాలో చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి చెప్పారు. ఈ సినిమాకి చక్రి చాలా వినసొంపైన బాణీలు అందించారనీ... ప్రముఖ గాయనీ గాయకులు వాటిని ఆలపించారని అన్నారు. ఈ నెలలో ఆడియో వేడుకని వినూత్నంగా జరపబోతున్నామనీ... మార్చ్ ద్వితీయార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. 'లీడర్'... 'నేను నా రాక్షసి' వంటి పరాజయాలతో డీలా పడిన రానాకి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుందో...ఏమో..!
No comments:
Post a Comment