రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' సినిమా తెరకెక్కుతున్న విషయం ప్రేక్షకులకి విదితమే. మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం తమిళనాడు- కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది. కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని ఓ సరస్సులో రామ్ చరణ్ -తమన్నాలపై ఓ డ్యూయెట్ ని చిత్రీకరించేందుకు దర్శకుడు సంపత్ నంది ఏర్పాట్లు చేసుకున్నాడు. అంతా రెడీ చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటుండగా, రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటి డైరెక్టర్ సంజయ్ కుమార్ అక్కడికి వచ్చి షూటింగ్ ని అడ్డుకున్నాడట. లైఫ్ జాకెట్ లేకుండా లేక్ లోకి అనుమతించనంటూ గట్టిగా చెప్పడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ విషయంలో జరిగిన గడబిడ కారణంగా అందరికీ మూడ్ పోయిందట. అది గ్రహించిన సంపత్ నంది వెంటనే పేకప్ చెప్పాడని తెలుస్తోంది.
No comments:
Post a Comment