తమిళ్ ఇండస్ట్రీలో మాంఛి దూకుడు మీదున్న హీరో శింబు 'వల్లభ' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకీ పరిచయమే. 'మిరపకాయ్' సినిమాలో లేత కొబ్బరి ముక్కలా కనిపించిన దీక్షా సేథ్... ప్రస్తుతం శింబు సరసన కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఆమె విక్రమ్ జోడీగా 'రాజాబాట్టాయ్' అనే తమిళ్ సినిమా చేసింది. ఆ సమయంలోనే అక్కడివారు శింబు గురించి ఆమె చెవిలో ఊదారట. శింబు తెర మీద పంచిన వినోదం కన్నా తెర వెనుక పెంచిన వివాదాలే ఎక్కువని చెప్పారు.
తెరపై హీరోయిన్ల వెంట పడటంలో ఎంత ఫాస్ట్ గా ఉంటాడో... బయట అంతకన్నా ఫాస్ట్ గా ఉంటాడనీ... అందుకే కథానాయికలంతా అయ్యగారికి ఆమడ దూరంలో ఉంటారని దీక్షాతో అన్నారట! నయనతార నుంచి మొదలుకొని నానా రకాల ఉదాహరణలు చెప్పినా, శింబు తన అభిమాన హీరో అంటూ దీక్షా కొట్టి పారేసింది. ఈ సంగతి తెలుసుకున్న శింబు, నిర్మాతలతో పట్టుబట్టి 'వెట్టయ్ మన్నన్' అనే సినిమాలో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చాడని అంటున్నారు. శింబు గురించి ఆమెకి చెప్పిన వాళ్లు మాత్రం... ఇక ఆ జంట మధ్య తలెత్తబోయే వివాదాలు వినడానికి రెడీ అయిపోయారని తెలుస్తోంది.
తెరపై హీరోయిన్ల వెంట పడటంలో ఎంత ఫాస్ట్ గా ఉంటాడో... బయట అంతకన్నా ఫాస్ట్ గా ఉంటాడనీ... అందుకే కథానాయికలంతా అయ్యగారికి ఆమడ దూరంలో ఉంటారని దీక్షాతో అన్నారట! నయనతార నుంచి మొదలుకొని నానా రకాల ఉదాహరణలు చెప్పినా, శింబు తన అభిమాన హీరో అంటూ దీక్షా కొట్టి పారేసింది. ఈ సంగతి తెలుసుకున్న శింబు, నిర్మాతలతో పట్టుబట్టి 'వెట్టయ్ మన్నన్' అనే సినిమాలో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చాడని అంటున్నారు. శింబు గురించి ఆమెకి చెప్పిన వాళ్లు మాత్రం... ఇక ఆ జంట మధ్య తలెత్తబోయే వివాదాలు వినడానికి రెడీ అయిపోయారని తెలుస్తోంది.
No comments:
Post a Comment